- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో స్యాండిల్ వుడ్ బ్యూటీలు సంజన, రాగిణి ద్వివేది పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరితో పాటు నటి అనికా, మరో పలువురు వ్యాపారవేత్తలు ఉన్నట్లు కూడా తొలుత వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ చేస్తున్న బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. కూపీ లాగేందుకు రక్త పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు.
అయితే, క్రైమ్ బ్రాంచ్ అధికారుల విచారణలో నటి సంజన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రక్త పరీక్షలు చేసుకోనని తెగేసి చెప్పడమే కాకుండా.. హాస్పిటల్లో నానా హంగామా చేసింది. తన నుంచి రక్తం సేకరించిన.. రిపోర్టు తనదేనని అనడానికి గ్యారెంటీ ఎంటని అనుమానం వ్యక్తం చేసింది. తన పై ఎటువంటి వ్యతిరేక ఆరోపణలు లేవని చెప్పిన సంజన.. మీడియా ముందు బలి పశువును చేసి ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.