- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘సింధూరం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి సంఘవి. ఆ తర్వాత అప్పటి అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేసింది. సీతారామరాజు, సూర్యవంశం, సమరసింహా రెడ్డి, ప్రేయసిరావే, సందడే సందడి ఇలా వరసగా సినిమాలు చేస్తూ.. మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు 45కు పైగా సినిమాలు చేసిన సంఘవి.. చివరగా యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ‘ఆంధ్రావాలా’ సినిమాలో నటించింది. 15 ఏళ్ల ఆమె సినీ కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళీ భాషల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఓ బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది.
సెకండ్ ఇన్నింగ్స్లో ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో.. జబర్దస్త్లో కొన్ని ఎపిసోడ్లకు సంఘవి జడ్జ్గా వ్యవహరించింది. అయితే ఆమె ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా సంఘవి.. తన కూతురితో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.