మార్కెట్‌లోకి శాంసంగ్ క్రిస్టల్ 4కె టీవీలు

by  |
మార్కెట్‌లోకి శాంసంగ్ క్రిస్టల్ 4కె టీవీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. భారత మార్కెట్‌లో అధునాతన స్మార్ట్‌ టీవీలను లాంచ్‌ చేసింది. ఈ మేరకు క్రిస్ట‌ల్ 4కె యూహెచ్‌డీ టీవీ, అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0 సిరీస్‌లను బుధవారం విడుద‌ల చేసింది. క్రిస్ట‌ల్ రేంజ్ టీవీలు 43, 50, 55, 65, 75 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో లభించనుండగా.. అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0 టీవీలు 32, 43 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో ల‌భిస్తున్నాయి. శాంసంగ్‌కు చెందిన బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్‌తో పాటు అమెజాన్ అలెక్సా అసిస్టెంట్‌ను కూడా ఈ టీవీల్లో జోడించడం విశేషం. అంతేకాకుండా వీటిని ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌గా కూడా వాడువ‌కోచ్చు. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ప్లామ్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ వంటివి ఇందులో ఇన్‌బిల్ట్‌గా లభిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడ‌ర‌ల్ బ్యాంక్‌, ఎస్‌బీఐ కార్డుల‌తో టీవీల‌ను కొనుగోలు చేస్తే.. 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. కాగా, క్రిస్ట‌ల్ 4కె యూహెచ్‌డీ సిరీస్‌ టీవీ ధరలు 44 వేల రూపాయల నుంచి 2 లక్షల 40 వేల వరకు ఉన్నాయి.

అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0

ధ‌ర – రూ.20,900/- (32 ఇంచులు)
ధ‌ర – రూ.41,900/- (43 ఇంచులు)


Next Story