భారత మార్కెట్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఏ31

by  |
భారత మార్కెట్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఏ31
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సామ్‌సంగ్.. గెలాక్సీ ఏ30కి కొనసాగింపుగా ఏ31 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గురువారం విడుదలైన ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బీనౌ ఈ కామర్స్ స్టోర్లతోపాటు సామ్‌సంగ్ ఇండియా ఈ స్టోర్, సామ్‌సంగ్ ఒపెరా హౌస్ ఆఫ్‌లైన్ స్టోర్‌లోనూ లభించనుంది. ఆండ్రాయిడ్ 10 వర్షన్‌తో నడిచే ఈ ఫోన్‌లో డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తోపాటు ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం ఉంది. ఈ ఫోన్ మూడు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

సామ్‌సంగ్ ఏ31 ఫీచర్స్ :

డిస్ ప్లే : 6.40 ఇంచులు
ప్రాసెసర్ : మీడియాటెక్ హెలియో పి 65
వర్షన్ : ఆండ్రాయిడ్ 10
ఫ్రంట్ కెమెరా : 20 మెగాపిక్సెల్
రేర్ కెమెరా : 48+8+5+5 మెగాపిక్సెల్
ర్యామ్ : 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 128 జీబీ
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
కలర్స్ : క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ బ్లూ, ప్రిస్మ్ వైట్
ధర : రూ. 21,999/-



Next Story

Most Viewed