కొరియోగ్రాఫర్‌గా మారనున్న ఆ హీరోయిన్..

by  |
కొరియోగ్రాఫర్‌గా మారనున్న ఆ హీరోయిన్..
X

దిశ, వెబ్ డెస్క్: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెను కొల్లగొట్టిన హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్మల దర్శకత్వంలో నాగ చౌతన్యతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. కరోనా విస్తృత వ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే సాయి పల్లవి హీరోయిన్‌గానే కాకుండా కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తనుంది. నిజమే.. ఓ సినిమా పాటకు ఆమె డ్యాన్సుల్ని కంపోజ్ చేయనుంది. ఈ ముచ్చట నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం విషయంలో చోటు చేసుకుంటోంది.

మామూలుగా పాటలకు కొరియోగ్రాఫర్లు డ్యాన్సుల్ని కంపోజ్ చేస్తుంటారు. అయితే, కాస్త వెరైటీ కోసం దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రంలోని ఓ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేయమని సాయిపల్లవిని రిక్వెస్ట్ చేశాడట. దాంతో ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుందని సమాచారం. షూటింగులు మొదలయ్యాక రామోజీ ఫిలిం సిటీలో ఈ పాటను చైతన్య, సాయిపల్లవిపై చిత్రీకరిస్తారు. అన్నట్టు, సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అన్న విషయం చాలామందికి తెలిసిందే.



Next Story