TS అసెంబ్లీ సమావేశాలు : కఠిన ఆంక్షలు 

by  |
TS అసెంబ్లీ సమావేశాలు : కఠిన ఆంక్షలు 
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా విజృంభిస్తున్న కారణంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆంక్షలు కఠినతరమయ్యాయి. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గ్యాలరీలోకి మాత్రమే మీడియాకు అనుమతినిచ్చింది.

ఎమ్మెల్యేలు, మంత్రుల ఛాంబర్ లోకి మీడియాకు అనుమతి నిరాకరించింది. ముందుగా ఎమ్మెల్యేలు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే లోపలికి ప్రవేశం కల్పించనున్నారు. కాగా వచ్చే సోమవారం నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.


Next Story

Most Viewed