బస్సు నడుపుతుండగానే..గుండె ఆగింది

by  |
బస్సు నడుపుతుండగానే..గుండె ఆగింది
X

దిశ వెబ్ డెస్క్: బస్సు నడుపుతూ ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందారు. ఘటన వివరాల్లోకెళితే…ఆర్టీసీ బస్సు పొదిలి టు విజయవాడ వెళుతోంది. బస్సు ఒంగోలుకు చేరుకోగానే డ్రైవర్ హనుమంత రావుకు గుండె పోటు వచ్చింది. దీంతో బస్సును డ్రైవర్ పక్కకు ఆపాడు. అంతలోనే హఠాత్తుగా ఆయన కుప్ప కూలి పోయారు. కాగా డ్రైవర్ ను గమనించి ప్రయాణీకులు ఆయనను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కాగా మార్గ మధ్యలోనే డ్రైవర్ మృతి చెందారు.


Next Story

Most Viewed