చీటీల పేరుతో ఘరానా మోసం..

by  |
చీటీల పేరుతో ఘరానా మోసం..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహా నగరంలో మరో ఘరానా మోసం మంగళవారం వెలుగులోకి వచ్చింది. దిల్‌సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో కంట్రోలర్ సురేందర్ చీటీల పేరుతో తోటి ఉద్యోగులను నిండా ముంచేశాడు. సుమారు. 6 కోట్ల మేర చీటీల డబ్బుతో పరారయ్యాడు.

సురేందర్‌ను నమ్మి అతని వద్ద చీటీలు వేసిన వారంతా తమకు న్యాయం చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాలని బాధితులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story