చిట్టీల పేరిట రూ.6కోట్లకు టోకరా !

by  |
చిట్టీల పేరిట రూ.6కోట్లకు టోకరా !
X

దిశ, క్రైమ్‌బ్యూరో: చిట్టీల పేరిట రూ.6కోట్లకు టోకరా పెట్టిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బాధితుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీకి చెందిన సురేందర్ దిల్‌సుఖ్‌నగర్‌ డిపోలో క్లర్‌గా పనిచేస్తూ చిట్టీల పేరిట 50మంది తోటి ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు.

కొడుకు, కూతురు చదువులు పూర్తయి అమెరికా వెళ్లేదాక నగరంలోనే ఉండి, తర్వాత చిట్టీ డబ్బులతో ఇళ్లు ఖాళీ చేసి పారిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. చాలారోజుల నుంచి ఫోన్ చేసినా స్విచ్ఛాప్ వస్తుందని.. అద్దె ఇళ్లు కూడా ఖాళీ చేసిపోవడంతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదని లబోదిబో మంటున్నారు.

ఈ విషయంపై వనస్థలిపురం పీఎస్‌‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఉద్యోగం చేసేది దిల్‌సుఖ్‌నగర్ కాబట్టి మలక్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని చెబుతున్నారని, అక్కడకు వెళ్తే ఉచిత సలహాలు ఇచ్చి వెనక్కి పంపారని సురేందర్‌కు రూ.35లక్షలు వడ్డీకి ఇచ్చిన ఓ బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.


Next Story

Most Viewed