రూ.లక్ష విలువ చేసే గుట్కా పట్టివేత..!

by  |
రూ.లక్ష విలువ చేసే గుట్కా పట్టివేత..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లక్ష రూపాయలు విలువ చేసే గుట్కాను గుర్తించారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. శాంతినగర్ ఈద్గా వద్ద షేక్ ఎజాజ్ అనే వ్యక్తి ఇంట్లో టాస్క్‎ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సంచుల్లో నిల్వ ఉంచిన రూ.లక్ష విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎజాజ్‎కు నిజామాబాద్ బస్టాండ్‎లో పాన్‎షాపులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఎజాజ్‎పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed