ఇబ్బంది పడుతుండ్రు.. కయ్యాలను పూడ్చండి

by  |
ఇబ్బంది పడుతుండ్రు.. కయ్యాలను పూడ్చండి
X

దిశ, హుస్నాబాద్: ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే కయ్యాలను పూడ్చాలని కరీంనగక్ పార్లమెంటరీ కో-ఆర్డినేటర్ పొతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భగా ఆయన గురువారం ఇల్లంతకుంట ఎంపీడీఓ విజయకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ..

సిద్దిపేట జిల్లా బెజ్జంకి, ఇల్లంతకుంట మండల పరిధిలోని బేగంపేట, గూడెం, లక్ష్మీపూర్, గాలిపెల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అత్యధికంగా నీటి ప్రవాహం రావడంతో పలు రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయన్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై పడ్డ పెద్ద పెద్ద కయ్యాలను పూడ్చి, కల్వర్టులు నిర్మించి, ప్రయాణికులకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.


Next Story

Most Viewed