ఇదంతా అవాస్తవం.. కన్నీరు పెట్టుకున్న రియా

by  |
ఇదంతా అవాస్తవం.. కన్నీరు పెట్టుకున్న రియా
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మలుపులు సినిమాను తలపిస్తున్నాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో సుశాంత్ లైఫ్‌లో హీరోయిన్‌గా ఉన్న రియా చక్రవర్తి.. ఒక్కసారిగా విలన్ అయిపోయింది. దీంతో తనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముందు నుంచి కూడా రియా డ్రామాలు ఆడుతోందని.. అసలు సుశాంత్ మృతికి మొదటి కారణం తనే అంటూ మండిపడుతున్నారు అభిమానులు. మీడియాలో సైతం రియాను దోషిగా నిలబెడుతూ అనేక వార్తలు ప్రసారమయ్యాయి.

దీంతో తొలిసారిగా స్పందించింది రియా.. దేవుడి మీద, చట్టం మీద నమ్మకం ఉందని.. తనకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని కన్నీరు పెట్టుకుంటూ వీడియో రిలీజ్ చేసింది. మీడియాలో తన గురించి చెప్తున్న భయంకరమైన విషయాలు తప్పని పేర్కొంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న రియా.. ‘సత్యమేవ జయతే’ అంటూ ముగించింది.

అయితే సుశాంత్ ఫ్రెండ్స్ ఈ వీడియో పై స్పందిస్తూ.. సుశాంత్ రియా తో డేటింగ్ స్టార్ట్ చేశాక.. మమ్మల్ని అందరినీ దూరంగా పెట్టేలా చేసిందని ఆరోపిస్తున్నారు. తన కాంటాక్ట్ డిటైల్స్ పూర్తిగా మార్చేసిందని.. తనను కలిసేందుకు ప్రయత్నించినా కుదరనివ్వలేదని చెప్తున్నారు. తాజాగా సుశాంత్ తండ్రి కూడా అదే చెప్పడం గమనించాలి అంటున్నారు.

కాగా కేకే సింగ్ రియాపై చీటింగ్, దొంగతనం, సుశాంత్ ఆత్మహత్యకు కారణం అంటూ కేసు పెట్టాడు. దీంతో రియా పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 306, 341, 342, 380, 406, 420 ల మీద కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ కేసును పాట్నా పోలీసుల నుంచి ముంబై పోలీసులకు అప్పగించాలి అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది రియా.


Next Story

Most Viewed