ఆర్జీవీకి షాక్

by  |
ఆర్జీవీకి షాక్
X

దిశ, వెబ్ డెస్క్: వివాదాలతోనే పబ్లిసిటీ తెచ్చుకునే సంచలన దర్శకుడు ఆర్జీవీకి.. ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే కనివినీ ఎరుగనీ రీతిలో .. ట్రైలర్‌ చూడాలంటే.. రూ. 25 పే చేయాలని ఆర్జీవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు. సినిమా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే..150 రూపాయలు చెల్లించాలని, ఆ గడువు ముగిసిపోతే, బ్లాక్ టికెట్‌కు రూ. 250 పే చేయాలని ప్రేక్షకులకు పబ్లిక్‌గా అనౌన్స్ చేశాడు. అయితే ఈ క్రమంలోనే ఈరోజు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ డాట్ కామ్ ద్వారా ‘పవర్ స్టార్’ ట్రైలర్ విడుదల చేయాల‌ని ప్లాన్ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సి ఉండగా ట్రైల‌ర్ లీక్ అయ్యిందని స్వయంగా ఆర్జీవీనే ట్విటర్‌ ద్వారా తెలిపారు. ట్రైలర్‌ లీక్ కావ‌డంతో మ‌రో గంట‌లో అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని ప్రకటించాడు.

ప్రేక్షకుల, అభిమానుల అటెన్షన్ డ్రా చేయడం, వారి వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకోవడం వర్మకు అలవాటే. ఆ క్రమంలోనే ‘పవర్ స్టార్’ చిత్ర ట్రైలర్‌కు రూ. 25 వసూలు చేశాడు. ఇప్పటికే చాలా మంది ట్రైలర్ చూడటానికి డబ్బులు చెల్లించారు. ఇప్పుడు ట్రైలర్ లీక్ కావడంతో..ఆ డ‌బ్బుల‌ను తిరిగి ఇచ్చేస్తాన‌ని రామ్‌గోపాల్ వ‌ర్మ చెప్పారు. అయితే ఇది తన ఆఫీసులోని స్టాఫ్‌లోని వ్యక్తులే చేసి ఉంటారని వర్మ అనుమానిస్తున్నారు. ఇక పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఈచిత్రంలోని ‘గడ్డి తింటావా’ పాటకు… 20 లక్షల వ్యూస్ రావడంతో అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ప‌వ‌ర్‌స్టార్ సినిమా జూలై 25న విడుద‌ల కానుంది.


Next Story

Most Viewed