గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు ఎత్తివేయాలి

by  |
గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు ఎత్తివేయాలి
X

దిశ, కోదాడ: గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలను ఎత్తివేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు అక్కిరాజు యశ్వంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ పట్టణంలోని విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీలను వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిని తాము ఖండిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వ నిరంకుశ ధోరణి ప్రవర్తిస్తే హిందూ సమాజం మొత్తం ఏకమై తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. హిందువుల మనోభావాలను ప్రభుత్వం తొందరగా గారితో అనాదిగా వస్తున్న ఉత్సవాలను చేసుకోకుండా ఆంక్షలు విధించిందని..ఆ ఆంక్షలను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఓర్స్ వేలంగి రాజు చేపూరి గణేష్, విశ్వహిందూ పరిషత్ నాయకులు బజరంగ్ దళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed