- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కూలీల కోసం వరంగల్లో శిబిరాలు

X
దిశ, వరంగల్: లాక్ డౌన్ నేపథ్యంలో రహదారుల గుండా నడుచుకుంటూ స్వగ్రామాలకు వెళ్లే వారు విశ్రాంతి తీసుకునేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ ప్రమీల సత్పతి తెలిపారు. ఈ శిబిరాన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడ మంచినీటి సౌకర్యం, కార్పెట్లు, అల్పాహారంతోపాటు లైటింగ్ వంటి వసతులు కల్పించామని చెప్పారు. ఈ శిబిరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని బల్దియా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజయ్య, సెక్రెటరీ విజయలక్ష్మిలను కమిషనర్ ఆదేశించారు.
Tags: rest camps, labourers, migrants, warangal, munciple commissioner pramila
Next Story