తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌లు

by  |
తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్ల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇవాళ్టి నుంచి ఈ- స్టాంపుల విక్రయాన్ని సైతం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించారు. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేయడంతో.. వీఆర్వోలు అందరూ తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటివరకు తమ వద్ద ఉన్న అన్నీ డాక్యుమెంట్స్‌ను అప్పగిస్తున్నారు.


Next Story

Most Viewed