పొలంలో రేషన్ బియ్యం

by  |
పొలంలో రేషన్ బియ్యం
X

దిశ‌, పాలేరు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడానికి పొలంలో సిద్ధంగా ఉంచి ముఠా గుట్టు పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామ శివారులో ఉన్న పొలాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ప్రాంతంలో అక్రమంగా తరలించటానికి సిద్ధం చేసిన 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు కూసుమంచి ఎస్సై ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఇందుకు సంబధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed