రేపటి నుంచి కరీంనగర్‌లో ర్యాపిడ్ టెస్ట్‌లు

by  |
రేపటి నుంచి కరీంనగర్‌లో ర్యాపిడ్ టెస్ట్‌లు
X

దిశ, కరీంనగర్: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా బాధితుల విషయంలో ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసకుంది. ర్యాపిడ్ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ట్రయల్ చేసిన జిల్లా అధికార యంత్రాంగం గురువారం నుంచి సివిల్ ఆసుపత్రితో పాటు చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్‌లో ర్యాపిడ్ టెస్ట్‌లు చేయడం ఆరంభించింది. ఇప్పటివరకూ హైదరాబాద్ వరకే పరిమితమైన ర్యాపిడ్ టెస్ట్‌ల విధానంలో మూడు రకాల పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిన వారితో పాటు కాబోయే వారిని కూడా గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుందని సమాచారం. శుక్రవారం నుంచి ర్యాపిడ్ టెస్ట్ విధానాన్ని మరింత విస్తృతం చేసే అవకాశాలు ఉన్నాయి.



Next Story