- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ముంబై మీదుగా అంబాలా ఎయిర్ బేస్ లోకి ఈ విమానాలు చేరుకోనున్నాయి. ఈ ఐదు విమానాల్లో రెండు శిక్షణా విమానాలు ఉన్నాయి. మిగతా మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి. యూఏఈలోని ఆల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుంచి ఇవి భారత్ కు బయల్దేరి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ నుంచి బయలుదేరగానే యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్ కతాకు రేడియో సందేశం వచ్చింది.
దీంతో వెల్ కమ్ టూ ఇండియన్ ఓషియన్ అంటూ ఐఎన్ఎస్ కోల్ కతా యుద్ధనౌక రేడియో సందేశం పంపింది. ఈ ఐదు రాఫెల్ విమానాలకు రక్షణగా మరో రెండు సుఖోయ్ జెట్స్ వస్తున్నాయి. ఈ విమానాలు ధ్వని కంటే నాలుగు రెట్లు వేగంగా ప్రయాణించగలవు. శతృ శిభిరాలను క్షణాల్లో ధ్వంసం చేసే సామర్థ్యం వీటి సొంతం.
Next Story