- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: అన్నం పెట్టిన ఇంటికే సున్నం కొట్టాడు. సంతోషం కొద్ది దావత్కు పిలిస్తే.. దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఈ అత్యాచారం, హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాళ్లోకి వెళితే.. జియగూడ కేశవస్వామి నగర్కు చెందిన ఆండాళ్ అనే మహిళ మేకల మండిలో మేకలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు కుమారుల ఉన్నారు. ఇటీవల ఆండాళ్ కేశవస్వామి నగర్లో సొంతిళ్లు కూడా నిర్మించుకుంటున్నారు. ఇళ్లు పూర్తి అవుతుండడంతో ఈ నెల 7న విందు కూడా ఏర్పాటు చేశారు.
ఈ విందుకు ఇల్లు నిర్మాణం చేపట్టిన మేస్త్రీతో పాటు అతడి స్నేహితుడు కూడా వచ్చాడు. ఈ సమయంలో ఎవరి హడావిడిలో వారు ఉన్నారు. ఇంటి సభ్యులు కూడా అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. అయితే, దావత్కు వచ్చిన మేస్త్రీ, అతడి స్నేహితుడు రవికి ఆండాళ్ భోజనం వడ్డించి.. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లి నిద్రపోయింది. ఆమెపై కన్నెసిన రవి మెల్లగా మొదటి అంతస్తుకు వెళ్లాడు. ఎవ్వరూ కూడా లేకపోవడం గమనించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత మార్చాడు. ఇదే సమయంలో ఆండాళ్ కుమారుడు రావడంతో.. అతడిని నెట్టేసిన నిందితుడి పరార్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.