డైలాగ్ రైటర్‌గా ‘తలైవా’

by  |
డైలాగ్ రైటర్‌గా ‘తలైవా’
X

దిశ, వెబ్‌డెస్క్ :
సూపర్ స్టార్ రజినీకాంత్ మానియా విదేశాల్లోనూ కనిపిస్తుంది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఒంటి చేత్తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించగల సత్తా తలైవా సొంతం. కలెక్షన్స్ మాట పక్కన పెడితే, రజినీ నుంచి ఈ మధ్య వచ్చిన సినిమాలు అభిమానులను నిరాశపరుస్తూనే ఉన్నాయి. చివరగా వచ్చిన ‘దర్బార్’ సినిమాకు కూడా యావరేజ్ టాక్ వినిపించగా.. నెక్స్ట్ మూవీతోనైనా ఫ్యాన్స్‌ను పక్కాగా సంతృప్తి పరచాలనే ఆలోచనలో ఉన్నారు రజినీ. అందుకే శివ దర్శకత్వంలో వస్తున్న ‘అన్నాత్తే’ మూవీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే రజినీ డైలాగ్ రైటర్‌గా మారబోతున్నాడని టాక్. సినిమాలో డైలాగ్‌లు పేలిపోవాలనే ఉద్దేశ్యంతో రజినీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే కేవలం తనకు మాత్రమే డైలాగ్స్ రాసుకుంటారా? లేక సినిమా మొత్తానికి రాస్తారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘అన్నాత్తే’ చిత్రానికి డి. ఇమాన్ సంగీతం అందించనున్నారు. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.


Next Story

Most Viewed