డ్రగ్స్‌ విక్రయిస్తున్న రాజస్థాన్ యువకుడు అరెస్ట్

by  |
డ్రగ్స్‌ విక్రయిస్తున్న రాజస్థాన్ యువకుడు అరెస్ట్
X

దిశ, క్రైమ్‌బ్యూరో: డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆరేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి నగరానికి వచ్చిన దినేశ్‌కుమార్ నాగోల్‌లోని ఓ షాపులో పనికి కుదిరాడు. మాదక ద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు.. లాక్‌డౌన్‌ కాలంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మళ్లీ రాజస్థాన్‌కు వెళ్లాడు. అక్కడ మాదక ద్రవ్యాలు తీసుకొని హైదరాబాద్‌‌కు వచ్చి అమ్ముతున్నాడు. దీంతో పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద 150 గ్రాముల ఓపీఎంతో పాటు సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed