- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: బహుభాషాకోవిదునిగా, ప్రధానిగా పీవీ నరసింహారావు దేశానికి విశిష్ట సేవలు అందించారని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడని అన్నారు. సాహితీవేత్తగా, రాజకీయ నాయకుడిగా బహుకోణాల్లో తన ప్రావీణ్యాన్ని నిరూపించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు విజయలక్ష్మి, జయరాజ్ కెన్నెడీ, ప్రియాంక అలా, బి. సంతోష్, కృష్ణ, యాదగిరి రావు, శంకరయ్య, సీపీఆర్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Next Story