సామాజిక‌, భౌతిక దూర‌మే శ్రీ‌రామ ర‌క్ష‌!

by Sridhar Babu |   ( Updated:2020-04-01 10:18:22.0  )

దిశ‌, ఖ‌మ్మం: క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న వేళ ప్ర‌జ‌లంతా, సామాజిక‌, భౌతిక దూరాన్ని, ప‌రిశుభ్ర‌త‌ని య‌థావిధిగా పాటిస్తూనే శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌ల‌ను త‌మ ఇళ్ల‌లోనే జ‌రుపుకోవాల‌ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పిలుపునిచ్చారు. స‌రుకుల కోసం పదే పదే మార్కెట్ల చుట్టూ తిర‌గ‌వద్ద‌ని సూచించారు. అందుబాటులో ఉన్న స‌రుకుల‌తోనే జ‌రుపుకోవాల‌న్నారు. ఈ సందర్భంగా మంత్రి తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Tags: Minister Puvvada Ajay Kumar, called, physical distance, khammam



Next Story

Most Viewed