కేరళలోనే పుష్ప షూటింగ్?

by  |
కేరళలోనే పుష్ప షూటింగ్?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప’. ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుండగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ‘ఆర్య, ఆర్య 2’ సినిమాలను మించిన సూపర్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తుందని భావిస్తున్నారు. అయితే ‘పుష్ప’ సినిమా.. శేషాచలం అడవులు, స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి, తొలుత షూటింగ్‌ను కేరళ ఫారె‌స్ట్‌లో ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడటం, కరోనా వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వికారాబాద్ అడవుల్లో షూట్ చేద్దామని అనుకున్నారు. మళ్లీ ఇప్పుడు కేరళలో షూటింగ్ చేయడమే బెటర్ అనే ఆలోచనకు సుకుమార్ వచ్చినట్టు తెలుస్తోంది.

కేరళలో బన్నీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ వేసిన డైరెక్టర్.. అక్కడి నేటివిటీకి తగినట్లుగా ఉంటే, ఆదరణ ఎక్కువగా లభిస్తుందని డిసైడ్ అయినట్టు టాక్. దీంతో మళ్లీ షూటింగ్ కేరళలోనే జరగనుంది. హీరోయిన్ రష్మిక మందాన.. ఈ సినిమాలో గిరిజన యువతిగా కనిపించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి బ్యానర్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.



Next Story

Most Viewed