ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు "పుష్ప" బృందం 

by  |
ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు పుష్ప బృందం 
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ కథ నేపథ్యంలో నిర్మిస్తున్న “పుష్ప” సినిమాలో హీరోగా నటిస్తున్నారు బన్నీ. ఈ మూవీ నిర్వహణలో భాగంగా ఆయన అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు.

కుటుంబ సభ్యులతో పాటు, చిత్ర బృందంతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతన్ని సందర్శించిన అల్లు అర్జున్, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత వనం పార్క్ ను సందర్శించి, పార్కులోని స్మృతివనంలో ఎర్ర చెందనం మొక్క నాటారు. అక్కడి నుండి జిల్లాకు పక్కనే ఉన్న మహారాష్ట్రలో తాజాగా పర్యటిస్తున్నారు. మహారాష్ట్రలోని పాండ్రకోడా జిల్లాలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతంలో పుష్ప సినిమా బృందం పర్యటిస్తున్నారు.

అయితే మార్గమధ్యలో యువకులు, అభిమానులు అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలుసుకొని తమ అభిమాన హీరోని చూసేందుకు పోటీ పడ్డారు. పలువురు యువకులు తమ సెల్ ఫోన్లలో బన్నీ ఫోటోలను బంధించారు. అటు అల్లు అర్జున్ సైతం యువకులకు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Read Also…

బీ అలెర్ట్ అంటోన్న విజయ్ దేవరకొండ టీమ్


Next Story

Most Viewed