- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ మూడు రోజుల్లో కొనుగోలు చేస్తాం…

దిశ, మెదక్:
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో అవసరమైన అన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు మెదక్ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి సూచించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులు, రైస్మిల్లర్లతో సమీక్షా సమావేశాన్ని ఆయన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి మాట్లాడుతూ… మెదక్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 320 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లాలో ఇప్పటికే 40 వేల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు. వీటన్నింటినీ మంగళ, బుధ, గురువారాల్లో పూర్తిగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ఎలక్ట్రానిక్ కాంటాలు, గన్నీ బస్తాలు, తాళ్లు, రైతులకు అవసరమైన నీటి సౌకర్యాలు, ట్రాన్స్ పోర్టింగ్లను ఏర్పాటు చేయాలని అధికారులును కలెక్టర్ ఆదేశించారు.