ప్రయాణం.. మార్పు తీసుకొస్తుంది : పూజా హెగ్డే

by  |
ప్రయాణం.. మార్పు తీసుకొస్తుంది : పూజా హెగ్డే
X

దిశ, వెబ్‌డె‌స్క్: పూజా హెగ్డే తొలి చిత్రం నుంచే సెలెక్టివ్ పాత్రలను ఎంచుకుంటూ.. టాలీవుడ్‌లో తన కెరీర్‌ను సుస్థిరం చేసుకుంది. చాలా తక్కువ కాలంలోనే అన్ని భాషల్లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఈ బుట్టబొమ్మ.. ఫుల్‌జోష్‌లో ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌కు జోడీగా ‘రాధే శ్యామ్‌’ సినిమాతో పాటు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’లోనూ నటిస్తోంది. ఇటీవల మోస్ట్ బ్యాచిలర్ చిత్ర యూనిట్‌తో షూటింగ్‌లో పాల్గొన్న పూజ.. ఈ రోజు వరల్డ్ టూరిజం డే సందర్భంగా తాను సందర్శించిన ప్రాంతాలకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది.

‘ప్రపంచ ప్రయాణం.. మన జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. భిన్నమైన వ్యక్తులు, వారి సంప్రదాయాలు, కథలు, వ్యూ పాయింట్స్.. మన ఆలోచనను మరింత విశాలపరుస్తాయి. మనలో మార్పును తీసుకొస్తాయి. ఓ ప్రాంతం ఇచ్చే శక్తి.. మనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని మరిచిపోకండి. కరోనా పాండమిక్ అంతా సెట్ అయిపోతే, మళ్లీ మనమంతా జాగ్రత్తగా ప్రయాణం చేయొచ్చు. హ్యపీ వరల్డ్ టూరిజం డే’ అని పేర్కొంది పూజ. ఇక పూజ కెరీర్ విషయానికొస్తే.. అఖిల్‌తో ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టిన ఈ భామ.. ప్రభాస్‌తో సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. తన పుట్టినరోజు (అక్టోబర్‌ 13), ప్రభాస్‌ బర్త్‌డే (అక్టోబర్‌ 23) సెట్‌లో జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది.


Next Story

Most Viewed