ఢిల్లీలో పెద్ద ఎత్తున విద్యార్థుల ధర్నా

by  |
ఢిల్లీలో పెద్ద ఎత్తున విద్యార్థుల ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్: యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో పరీక్షలు నిర్వహించడం సరికాదంటూ కేంద్రంపై వారు మండిపడ్డారు. పరీక్షల నిర్హణపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Next Story

Most Viewed