నేడు అయోధ్యకు మోడీ

by  |
నేడు అయోధ్యకు మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: నేడు అయోధ్యలో రామాలయానికి భూమి పూజ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఉదయం 10.35 గంటలకు లక్నో చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు అయోధ్యలోని సాకేత్ కళాశాల మైదానానికి చేరుకోనున్నారు. 11.40 గంటలకు హనుమాన్ గుడికి చేరుకోనున్నారు.

అక్కడ పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు రామాలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటనున్నారు. ఆ తర్వాత 12.30 గంటలకు అయోధ్య రామాలయానికి భూమి పూజ కార్యక్రమం ప్రారంభం కానున్నది. 12.44 గంటలకు శంఖుస్థాపన కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమం తదనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రధాని మోడీ తిరుగు ప్రయాణం కానున్నారు. ఇదిలా ఉంటే ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను పరిశీలించిన విధితమే.



Next Story