గొప్ప నాయకుడిగా ప్రధాని మోదీకి గుర్తింపు..!

by  |
గొప్ప నాయకుడిగా ప్రధాని మోదీకి గుర్తింపు..!
X

దిశ, ముషీరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ ఒక గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని సేవా సప్తాహంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముషీరాబాద్ బీజేపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కె.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరోనా బాధితులకు అవసరమైన రక్తాన్ని అందించేందుకు 70 మంది యువ మోర్చా కార్యకర్తలు రక్తదానం చేశారన్నారు. పార్లమెంటులో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడితే కోడిగుడ్డు మీద ఈకలు పీకే చందంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి రైతు పెట్టిన పెట్టుబడి మీద 50 శాతం లాభం చేకూర్చడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. మోదీ చేసే అభివృద్ధిని చూడలేకే.. ప్రతిపక్షాల నేతలు ప్రతి పనిని తప్పు పడుతున్నారని విమర్శించారు.



Next Story