ఎంపీలకు టీ అందించిన డిప్యూటీ చైర్మన్‌

by  |
ఎంపీలకు టీ అందించిన డిప్యూటీ చైర్మన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారు తమ సస్పెన్షన్ అనైతికమని, అప్రజాస్వామికమని ఆరోపిస్తూ, పార్లమెంట్ ఆవరణలో దీక్ష చేస్తున్నారు. ఈ సందర్బంగా మంగళవారం పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ వారిని కలిసి, దీక్ష విరమించాలని కోరినట్టు సమాచారం. అంతేగాకుండా ఎంపీలకు స్వయంగా డిప్యూటీ చైర్మన్ టీ అందించారు. దీంతో విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయన్ను ప్రశంసించారు. ఎంపీలపై హరివంశ్ సింగ్ చొరవ అభినందనీయమని ప్రధాని అన్నారు.



Next Story

Most Viewed