శ్రావణి కేసులో ఇద్దరు నిందితుల కస్టడీ

by  |
శ్రావణి కేసులో ఇద్దరు నిందితుల కస్టడీ
X

దిశ, క్రైమ్ బ్యూరో :
నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరు నిందితులను ఎస్ఆర్ నగర్ పోలీసులు కస్టడీకీ తీసుకున్నారు. శ్రావణి ఆత్మహత్య కంటే ముందుగా సాయి కృష్ణారెడ్డి – శ్రావణి, దేవరాజ్ – శ్రావణి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను రికార్డు చేసేందుకు కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. దీంతో శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులు సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలను మాత్రమే ఎస్సార్ నగర్ పోలీసులు కస్టడీకీ తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో, వీడియోలను పోలీసులు రికార్డు చేయనున్నారు. అంతే కాకుండా, ఆత్మహత్యకు ముందు పంజాగుట్ట శ్రీకన్య హోటల్ వద్ద ముగ్గురి మధ్య చోటు చేసుకున్న వివాదానికి సంబంధించి వివరాలను కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీకన్య హోటల్ వద్ద సంఘటనను సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, శ్రావణి కేసులో ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని మాత్రమే పోలీసులు కస్టడీకి తీసుకుని తిరిగి విచారిస్తూ.. నిర్మాత అశోక్ రెడ్డిని మాత్రం పోలీసులు కస్టడీ కోరకపోవడం గమనార్హం. అయితే, ఈ విషయాన్ని ఎస్సార్ నగర్ పోలీసులను వివరణ కోరగా సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిల ఫోన్ సంభాషణతో పాటు హోటల్ వద్ద సంఘటన వివరాలను మాత్రమే విచారించి, వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్టు తెలిపారు. వీరి కస్టడీ ఆదివారంతో ముగియనుంది.


Next Story

Most Viewed