ఇది ఆషామాషీ పేకాట కాదు…! 

by  |
ఇది ఆషామాషీ పేకాట కాదు…! 
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం కర్నూలు జిల్లాలోని గుమ్మనూరులో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారు పేకాటరాయుళ్లు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు బైకులు, 5 వేలు, సామాన్యులు పట్టుబడితే ఆషామాషీనే…! కానీ అక్కడ పెద్ద తలకాయలు భారీగా నగదుతో, వాహనాలతో పట్టుబడ్డారు.

ఏకంగా 40 వాహనాలు, రూ.5.44 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గురువారం కర్నూలు నుంచి వచ్చిన నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. పోలీసులు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ అనుచరులు పోలీసులపై ఎదురు దాడికి పాల్పడినట్టు స్థానిక సమాచారం.

ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న 33 మంది పేకాట రాయుళ్లు పరారవుతుండగా వారిని పట్టుకొని చిప్పగిరి పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఎస్పీ గౌతమిశాలి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న 40 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఆమె తెలిపారు. ఈ దాడుల్లో ఒక సీఐ, నలుగురు ఎస్సైలు, 20 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed