వేట కత్తులతో మర్డర్‌ ప్లాన్ ఫెయిల్

by  |
వేట కత్తులతో మర్డర్‌ ప్లాన్ ఫెయిల్
X

దిశ, అమరావతి: గుంటూరులో వేట కత్తుల స్వాధీనం కలకలం రేపింది. నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అమ్మిరెడ్డి రౌడీ షీటర్లపై ప్రత్యెక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆరండల్ పేటలో హత్య చేసేందుకు పథకం రూపొందిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. వారిని విచారించగా ఓ వ్యక్తి హత్యకు కుట్ర చేస్తున్నట్లు తెలిసింది. వారి నుండి 8 వేట కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారనే అంశంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అత్యాచారం చేసి బెదిరింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని రౌడీ ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.



Next Story

Most Viewed