పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

by  |
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
X

దిశ, మహబూబ్‎నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో పేకాట స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఇటిక్యాల మండలం ఉదండపురం గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 97,890, ఏడు సెల్‌ఫోన్లు, తొమ్మిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.

Tags: Police raids, poker bases, arrest, Jogulamba gadwal


Next Story

Most Viewed