పోలీసుల దాడి… పరారీలో ఉప సర్పంచ్

by  |
పోలీసుల దాడి… పరారీలో ఉప సర్పంచ్
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్‌నగర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఇంటిపై పోలీసులు గురువారం దాడి చేశారు. వివరాళ్లోకి వెళితే… గతకొంత కాలంగా ఉపసర్పంచ్ శేఖర్ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా, ఇంట్లో గంజాయి కూడా లభ్యం అయింది.

దీంతో పేకాట ఆడుతున్న 14 మందితో పాటు, గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. గతకొంత కాలంగా ఈ దందాను నడిపిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఈ విషయంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story