పేకాట స్థావరాలపై దాడి… 21 మంది అరెస్ట్

by  |
పేకాట స్థావరాలపై దాడి… 21 మంది అరెస్ట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్‌, నగర శివారులోని జన్నేపల్లిలో సీపీ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానిక ఎస్ఐలతో కలిసి టాస్క్‌ఫోర్స్ సీఐ షాకీర్ అలీ ఈ దాడులు ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 21మంది జూదరులను అరెస్ట్ చేశారు.

గాయత్రినగర్ విశ్వ వికాస్ స్కూల్ వద్ద ఒక ఇంటిలో దాడులు చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,20,740 నగదు, 12 సెల్ ఫోన్లు, 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా జన్నేపల్లి గ్రామంలో దాడులు నిర్వహించి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.17,370 నగదు స్వాధీనం చేసుకొని, నాలుగు బైకులు పట్టుకున్నారు.



Next Story

Most Viewed