- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్, నగర శివారులోని జన్నేపల్లిలో సీపీ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానిక ఎస్ఐలతో కలిసి టాస్క్ఫోర్స్ సీఐ షాకీర్ అలీ ఈ దాడులు ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 21మంది జూదరులను అరెస్ట్ చేశారు.
గాయత్రినగర్ విశ్వ వికాస్ స్కూల్ వద్ద ఒక ఇంటిలో దాడులు చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,20,740 నగదు, 12 సెల్ ఫోన్లు, 8 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా జన్నేపల్లి గ్రామంలో దాడులు నిర్వహించి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.17,370 నగదు స్వాధీనం చేసుకొని, నాలుగు బైకులు పట్టుకున్నారు.
Next Story