పైసల కోసం పాడు పని.. యువతులతో…

by  |
పైసల కోసం పాడు పని.. యువతులతో…
X

దిశ, వెబ్‌డెస్క్: పైసల కోసం పక్కదారి పట్టిన ముగ్గురు వ్యక్తులు పాడు పనిని ఎంచుకున్నారు. అందుకు విజయవాడ భవానీపురంలోని ఓ ఇంటిని అడ్డగా మార్చుకొని ఈజీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇదేక్రమంలో ఆ ఇంట్లోకి ఎవరెవరో వచ్చి వెళ్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కాసమాచారంతో వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించిన పోలీసులు ముగ్గురు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులు, యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ముఠా వెనుక ఎవరిదైన పెద్ద హస్తం ఉందా లేకుంటే, ఈ ముగ్గురే దందా నడిపిస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed