రూ. 72 లక్షల మద్యం సీసాలు ధ్వంసం

by  |
రూ. 72 లక్షల మద్యం సీసాలు ధ్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అక్రమ మద్యం సరఫరా, నిల్వలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో ధరలు పెరిగిపోవడంతో అక్రమార్కులు జోబులు నిప్పుకునేందుకు అనేక మార్గలు వెతుకుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు అధికారులు ఓ నిఘా వేస్తున్నారు. అయితే, తాజాగా పోలీసులు మద్యం సీసాలను ధ్వంసం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ఏకంగా రూ. 72 లక్షలు విలువ గల మద్యం సీసాలను రోడ్ రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. అయితే, ఈ వీడియో చూసిన మందుబాబులు సోషల్ మీడియా వేదికగా నిరుత్సాహం కనబరచడం గమనార్హం.


Next Story