శవాన్ని వాగు దాటించిన పోలీసులు

by  |
శవాన్ని వాగు దాటించిన పోలీసులు
X

దిశ, హుజురాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హుజూరాబాద్ లో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆకునూరు దగ్గర రోడ్డు తెగిపోయింది. దీంతో వాగు దాడటానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు స్పందించి ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆ వాగు దాటించారు.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల పోచయ్య అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చనిపోవడంతో సొంత ఊరు గొల్ల గూడెం తీసుకొస్తున్న సమయంలో ఆకునూరు దగ్గర రోడ్డు తెగిపోవడంతో శవాన్ని దాటించడానికి ఇబ్బంది ఏర్పడింది. ఈ క్రమంలో స్థానిక ఎస్సై ప్రశాంత్ రావుకు ఫోన్ చేశారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సిబ్బందితో అక్కడికి చేరుకుని తాళ్ల సాయంతో శవాన్ని వాగు దాటించారు. దీంతో ఆ ఎస్సైని, పోలీస్ సిబ్బందిని ఆ గ్రామప్రజలు అభినందించారు.


Next Story

Most Viewed