రేషన్ బియ్యం పట్టివేత

by  |
రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ, నిర్మల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు సారంగాపూర్ ఎస్ఐ రాంనరసింహారెడ్డి తెలిపారు. సిబ్బందితో కలసి స్థానిక ఎస్సై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా భోరిగామ్ గ్రామ సమీపంలో అనుమానం వచ్చి టాటా ఏసీ వాహనాన్ని ఆపారని తెలిపారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 8 క్వింటాళ్ల రేషన్ బియ్యం దొరికాయన్నారు. దీంతో వెంటనే వాహనాన్ని పొలీస్ స్టేషన్‌కు తరలించి, డ్రైవర్‌ను అదుపులో తీసుకొని విచారించినట్టు తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్ర కు తరిస్తున్నట్టు విచారణలో డ్రైవర్ వెల్లడించినట్టు తెలిపారు. వాహనాన్ని తాశీల్దార్‌కు అప్ప చెప్పామని తెలిపారు.


Next Story

Most Viewed