- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: లఢక్లోని గాల్వాన్ వ్యాలీలో గత నెల చైనా సైనికుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధాని మోడీ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..మీ ధైర్య సాహసాలకు సెల్యూట్ చేసేందుకే ఇక్కడిదాకా వచ్చానని తెలిపారు. బోర్డర్లో భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను స్వయంగా పరిశీలించేందుకు ఈ రోజు మోడీ లఢక్కు ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్లో చేరుకున్నారు. అయితే, బోర్డర్లోని పరిస్థితులను బిపిన్ రావత్ ప్రధానికి వివరించారు. సైనికులకు అవరసరమైన అన్ని ఏర్పాట్లును భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని, మన శక్తిని ప్రపంచం గుర్తించిందని, శాంతిని కోరుకునే దేశం జోలికి వస్తే..ప్రతిస్పందన ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు చూపించాలని మోడీ జవాన్లకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ బోర్డర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.