27న సీఎంలతో పీఎం మీట్

by  |
27న సీఎంలతో పీఎం మీట్
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం సమావేశంకానున్నారు. కరోనా పరిస్థితులను సమీక్షించడానికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లతో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

సీనియర్ ఆరోగ్యాధికారులు, పోలీసులు, ముఖ్యమైన రాష్ట్ర మంత్రులతోపాటు కేంద్ర మంత్రులు మంత్రి అమిత్ షా, హర్షవర్ధన్ మరికొందరు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అన్‌లాక్ 2.0 గడువు ముగుస్తున్న నేపథ్యంలో వీరితో పీఎం భేటీ కానున్నారు. కొవిడ్ 19 కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించనున్నట్టు సమాచారం.



Next Story