రామజన్మభూమిలో మోడీ.. కాసేపట్లో భూమి పూజ

by Shamantha N |
రామజన్మభూమిలో మోడీ.. కాసేపట్లో భూమి పూజ
X

దిశ, వెబ్ డెస్క్: రామజన్మభూమికి ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రంలో ఆయన పాల్గొననున్నారు. 12.40 గంటలకు ప్రధాని పునాది రాయి వేయనున్నారు. అనంతరం 12.45 గంటలకు ఆయన ప్రసంగించనున్నారు.

కాగా, ఉదయం 11.35 గంటలకు ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్న మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు ఘనస్వాగంత పలికారు. అనంతరం యోగితో కలిసి హనుమాన్ గర్హి ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తదనంతరం రామజన్మభూమికి బయల్దేరారు.

Advertisement

Next Story

Most Viewed