రేపు రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు

by Shamantha N |
రేపు రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి (మూడో) విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచే బ్యాంకుల నుంచి రైతులకు మెస్సెజ్​లు వచ్చాయి. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో శుక్రవారం దేశవ్యాప్తంగా రూ.2 వేల చొప్పున జమచేశారు. శుక్రవారం ఉదయం పీఎం-కిసాన్‌ నిధుల పంపిణీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.

ఈ పథకం కింద రాష్ట్రంలో 39.17 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో సాంకేతిక సమస్యల కారణంగా సగటున 37.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతున్నాయి. ఈ లెక్క ప్రకారం రాష్ట్ర రైతాంగం ఖాతాల్లో పీఎం- కిసాన్‌ పథకంలో భాగంగా ఈ ఏడాది మూడో విడతలో రూ.750 కోట్లు బ్యాంకులకు అక్కడ నుంచి రైతుల ఖాతాలకు జమ చేశారు. ప్రతి ఏడాదిలో మూడు విడతలుగా… ఒక్కో విడతకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ. 6 వేలు కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌-జూలై మధ్యలో మొదటి విడత, ఆగస్టు నుంచి నవంబరు మధ్యలో రెండో విడత, డిసెంబరు నుంచి మార్చి వరకు మూడో విడత చెల్లింపులు చేస్తోంది.

Next Story

Most Viewed