అందర్నీ చంపేస్తా.. గ్యాంగ్ స్టర్ ఫోన్ సంభాషణ లీక్

by  |
అందర్నీ చంపేస్తా.. గ్యాంగ్ స్టర్ ఫోన్ సంభాషణ లీక్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేని ఇటీవల పోలీసులు ఎన్‌కౌంట్ చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్‌కౌంటర్‌కు మందురోజు వికాస్ దూబే, ఓ కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం తెగ వైరస్ అవుతోంది. అంతేగాకుండా ఎన్ కౌంటర్ జరపడానికి వెళ్లిన పోలీసులపై ఎదురుదానికి దిగి, ఎనిమిది మందిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వికాస్‌ దూబేకు, చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ రాజీవ్‌ చౌదరితో మాట్లాడుతూ.. ‘నా మీద పెద్ద కుంభకోణాన్ని మోపబోతున్నారని తెలిసింది. అయితే నాతో ఛాలెంజ్‌ చేసిన ఆ వ్యక్తికి ఓ విషయం అర్థం అయ్యేలా చేయబోతున్నాను. జీపులో ఉన్న అందరినీ హతమారుస్తాను. దీని కోసం జీవితాంతం జైలులో ఉండటానికి కూడా నేను సిద్ధమే. ఇప్పుడు అతడు వికాస్‌ దూబే టార్గెట్‌. అతడిని చంపేవరకు ఇంటికి తిరిగి వెళ్లను’ అని ఫోన్‌లో వికాస్ దూబే కానిస్టేబుల్‌తో మాట్లాడాడు. అయితే ప్రత్యేకంగా ఎవరి గురించి మాట్లాడాడనే విషయం మాత్రం తెలియరాలేదు.


Next Story

Most Viewed