ముగ్గురికి మత్తిచ్చి దారుణ హత్య.. ఆపై శవాలతో శృంగారం!

by  |
ముగ్గురికి మత్తిచ్చి దారుణ హత్య.. ఆపై శవాలతో శృంగారం!
X

దిశ, వెబ్‌డెస్క్ :

భార్య మీద అనుమానం కాస్త ఆమెతో పాటు అత్త, మరదలి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. అంతటితో ఆగకుండా వారి మృతదేహాలతో ఆ కిరాతకుడు శృంగారం చేశాడు. అసలు విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనం నెలకొంది. ఈ ఘటన హర్యానాలోని పానిపట్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సోనెపత్‌ జిల్లా, పట్టి కలియానా గ్రామానికి చెందిన నూర్‌ హాసన్‌ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి అత్త, మరదలు సాయం చేస్తున్నారని భావించాడు. దీంతో వారిపై కక్ష పెంచుకుని హత్యకు పథకం రచించాడు.

కొద్దిరోజుల కిందట భార్య, మరదలికి మత్తు మందు ఇచ్చి కత్తితో నరికి చంపేశాడు. అనంతరం వారి శవాలతో శృంగారం చేశాడు. ఆ వెంటనే మృతదేహాలను దుప్పట్లో చుట్టి దూరంగా పడేశాడు. మరల మూడ్రోజుల తర్వాత అత్తగారి ఊరికి వెళ్లి ఆమెను అక్కడి నుంచి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెను కూడా హతమార్చి, ఆమె శవంతో కూడా సెక్స్ జరిపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మంటల్లో తగలబెట్టాడు.

కొంతకాలంగా ఇంట్లో ఎవరూ కనిపించకపోవడాన్ని గమనించిన బంధువులు హాసన్‌ను నిలదీయగా అతను సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా హాసన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెల్లడైంది. భర్య మీద అనుమానంతో తను చేసిన నేరాలను నిందితుడు అంగీకరించాడు. అతని ఇచ్చిన సమాచారం ప్రకారం… ఆ ముగ్గురి మృతదేహాలను వేర్వేరు చోట్ల స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంకు పంపించారు. దీంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


Next Story

Most Viewed