డీసీఎం బైక్ ఢీ.. వ్యక్తి మృతి 

by  |
డీసీఎం బైక్ ఢీ.. వ్యక్తి మృతి 
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్: మహబుబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని పట్టణ సమీపం వద్ద గల ధర్మాపూర్, ఆర్టీవో ఆఫీస్ వద్ద బుధవారం సాయంకాలం చోటుచేసుకుంది.

వివరాల్లోకివెళితే.. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తిని డీసీఎం వ్యాన్ వెనుకనుంచి వచ్చి ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చౌదర్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి‌గా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story