గణేశ్ నిమజ్జనంలో అపశృతి..

by  |
గణేశ్ నిమజ్జనంలో అపశృతి..
X

దిశ, వెబ్‌డెస్క్ :

గణేశ్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గణపతి నవరాత్రుల ముగియడంతో ఇంటి వద్ద ప్రతిష్టించిన విగ్రహాన్ని నిమజ్జనం కోసం గ్రామస్తులు కొండమడుగులోని చెరువు వద్దకు తీసుకుచ్చారు.

ఈ క్రమంలోనే నిమజ్జనం చేస్తుండగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు తోటివారు ప్రయత్నించినా ఫలితం లేకండా పోయింది. ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయి ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. విషయం తెలియడంతో కొండమడుగు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.


Next Story

Most Viewed